venkatesh: 'వెంకీమామ' షూటింగులో జాయినైన పాయల్ రాజ్ పుత్

  • బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ'
  • రాజమండ్రిలో జరుగుతోన్న షూటింగ్ 
  • హాస్యరస ప్రధానంగా సాగే కథ      

వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. వెంకీ .. చైతూ కాంబినేషన్లో కొన్ని సరదా సన్నివేశాలను చిత్రీకరించారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగులో రాశి ఖన్నా జాయిన్ కాగా, తాజాగా పాయల్ రాజ్ పుత్ జాయిన్ అయింది.

'వెంకీమామ' షూటింగులో పాల్గొన్నాను .. చాలా ఎగ్జైటింగ్ గా వుంది' అని ఆమె పేర్కొంది. ఈ సినిమాలో చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తుండగా .. వెంకటేశ్ సరసన నాయికగా పాయల్ కనిపించనుంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాపై దర్శకుడు బాబీ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. 'ఎఫ్ 2' తరువాత వెంకటేశ్ నుంచి వస్తోన్న మరో వినోదభరిత చిత్రం కావడంతో, అభిమానుల్లోను అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి మరి.

More Telugu News