Ghanta Murali: వైసీపీకి ఘంటా మురళి రాజీనామా.. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక

  • రాష్ట్ర విభజనానంతరం కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరిక
  • వైసీపీలో కీలక నేతగా బాధ్యతలు
  • మురళి రాజీనామాతో ప.గో.లో మారనున్న రాజకీయ సమీకరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో వలస రాజకీయాలు ఊపందుకున్నాయి. వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనకు మద్దతుగా పశ్చిమ గోదావరికి చెందిన మరికొందరు నేతలు కూడా వైసీపీకి రాజీనామా చేశారు.

ఒకప్పుడు కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిన మురళి.. రాష్ట్ర విభజనానంతరం వైసీపీలో చేరారు. ఆ పార్టీ ముఖ్య నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన వైసీపీకి రాజీనామా సమర్పించారు. నేడు చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కనున్నారు. మురళీ రాజీనామా వైసీపీకి ఎదురుదెబ్బేనని చెబుతున్నారు. 

More Telugu News