India: ఇథియోపియా విమాన ప్రమాద మృతుల్లో నలుగురు భారతీయులు

షార్ట్స్‌లో చూడండి
ఇథియోపియాలో ఆదివారం నాడు చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో నలుగురు భారతీయులు కూడా మృతి చెందినట్టు ఆలస్యంగా తెలిసింది. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నగరం నైరోబీకి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. విమానంలో మొత్తం 157 మంది ఉన్నారు. టేకాఫ్ తీసుకున్న 6 నిమిషాల్లోనే విమానం మైదాన ప్రాంతంలో కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన నలుగురు భారతీయుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి భారత విదేశాంగ వర్గాలు సమాచార సేకరణలో నిమగ్నమయ్యాయి.
Go Back to Shorts
India

More Telugu News