Geetagovindam: వచ్చిందెంత... కట్టిందెంత?... విజయ్ 'గీతగోవిందం' సినిమా నిర్మాతలపై ఐటీ దాడులు!

  • 'జీఏ 2 పిక్చర్స్‌' కార్యాలయంపై దాడులు
  • ఆదాయం, పన్నులను పరిశీలించిన అధికారులు
  • పాత సినిమాల లెక్కల పైనా ఆరా

యూత్ ఐకాన్, 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఎనలేని పాప్యులారిటీని పొందిన నటుడు విజయ్‌ దేవరకొండ నటించగా, గత సంవత్సరం విడుదలై ఘన విజయం సాధించిన 'గీతగోవిందం' సినిమా నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టి పడింది. నిన్న సినిమా నిర్మాతల కార్యాలయాలకు వచ్చిన ఐటీ అధికారులు సినిమా కలెక్షన్లు, చెల్లించిన పన్ను వివరాలను పరిశీలించారు.

హైదరాబాద్, బంజారాహిల్స్‌ లోని 'జీఏ 2 పిక్చర్స్‌' కార్యాలయానికి వచ్చిన ఐటీ యూనిట్‌ - 14 బృందం, వసూళ్ల రికార్డులను పరిశీలించింది. ఈ సినిమా సుమారు రూ. 130 కోట్ల వరకూ వసూలు చేసివుంటుందని భావిస్తున్న అధికారులు, ఆ మేరకు పన్నులను చెల్లించారా? లేక ఏమైనా ఎగ్గొట్టారా? అసలు సినిమా వసూళ్లు ఎంత? అన్న వివరాల లెక్కలు తీస్తూ, నిర్మాణ సంస్థ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 'జీఏ 2 పిక్చర్స్‌' గతంలో తీసిన రెండు సినిమాల వివరాలు, వాటి ఆదాయాలను, లెక్కలను కూడా పరిశీలించారు.

More Telugu News