rahul gandhi: ఆప్ తో పొత్తు పెట్టుకోకపోవడానికి కారణం ఇదే: రాహుల్ గాంధీ

  • ఢిల్లీలో పొత్తుకు కాంగ్రెస్ కేడర్ ఇష్టంగా లేదు
  • అందుకే ఢిల్లీలో ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నాం
  • జాతీయ స్థాయిలో కలిసే పని చేస్తాం

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ ల మధ్య పొత్తు కుదరని నేపథ్యంలో, ఈ అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని... కానీ ఢిల్లీలోని పార్టీ శ్రేణులు మాత్రం పొత్తులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కారణం వల్లే ఢిల్లీలో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగబోతోందని చెప్పారు. అయితే, జాతీయ స్థాయిలో కూటమి, పొత్తులు మాత్రం ఉంటాయని తెలిపారు. 

More Telugu News