sensex: కొనసాగుతున్న బుల్ జోరు.. వరుసగా నాలుగో రోజు లాభాలు

  • 89 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 5 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • రెండున్నర శాతానికి పైగా లాభపడ్డ ఎల్ అండ్ టీ

దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు మన స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఒకానొక సమయంలో 200 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్ ఆ తర్వాత కొంత లాభాలను కోల్పోయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్  89 పాయింట్ల లాభంతో 36,725కు పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 11,058 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.76%), యాక్సిస్ బ్యాంక్ (1.77%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.71%), ఐటీసీ (1.61%), ఎస్బీఐ (1.26%).

టాప్ లూజర్స్:
కోల్ ఇండియా (3.09%), సన్ ఫార్మా (1.97%), ఎన్టీపీసీ (1.68%), ఓఎన్జీసీ (1.58%), యస్ బ్యాంక్ (1.47%).      

More Telugu News