Nagar Kurnool: పల్లీకోత యంత్రం బోల్తా పడటంతో ముగ్గురి మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు

  • ట్రాక్టర్‌కు ఉన్న యంత్రం ఒక్కసారిగా బోల్తా
  • జయమ్మ, గౌరమ్మ, తిక్కన్న మృతి
  • నల్లవెల్లి, లింగసానిపల్లిలో విషాదం

పల్లీ కోత యంత్రం బోల్తా పడటంతో ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నాగర్ కర్నూలు మండలంలోని నల్లవెల్లి గ్రామంలో నేడు ట్రాక్టర్‌కు ఉన్న పల్లీ కోత యంత్రం ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో లింగసానిపల్లి గ్రామానికి చెందిన జయమ్మ, గౌరమ్మ, తిక్కన్న మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరు గ్రామాల్లో విషాదం నెలకొంది.

More Telugu News