Noushira Sector: నేడు వరుసగా రెండోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్

  • ఉదయం పూంచ్ సెక్టార్‌లో కాల్పులు
  • రెండోసారి నౌషిరా సెక్టార్‌లో కాల్పులు
  • సమర్థంగా ఎదుర్కొంటున్న భద్రతా బలగాలు

నేటి ఉదయం పూంచ్ సెక్టార్‌లో సరిహద్దు గ్రామాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడి కొన్ని గంటలు కూడా గడవక ముందే రెండోసారి మళ్లీ కాల్పులకు తెగబడింది. ఆ విధంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ నేడు వరుసగా రెండోసారి ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లోని నౌషిరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ పొడవునా పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో జరిగిన ప్రాణనష్టంపై ఇప్పటి వరకూ సమాచారం అందలేదు. అయితే భారత భద్రతా బలగాలు మాత్రం పాక్ సైన్యం జరుపుతున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News