sukumar: సుకుమార్ తరువాత బన్నీ సినిమా మురుగదాస్ తోనే

  • త్రివిక్రమ్ తో త్వరలోనే సెట్స్ పైకి
  • సుకుమార్ కి గ్రీన్ సిగ్నల్
  • లైన్లోనే వున్న విక్రమ్ కుమార్      

త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి అల్లు అర్జున్ సిద్ధమవుతున్నాడు. పూర్తి వినోదభరితంగా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే .. బన్నీ తదుపరి సినిమా సుకుమార్ తో వుండనుందనే ప్రకటన వచ్చేసింది. నిన్న మొన్నటివరకూ మహేశ్ తో సుకుమార్ కథా చర్చలు .. మార్పులు .. చేర్పులు అంటూ వార్తలు వచ్చి, ఒక్కసారిగా సీన్ మారిపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు.

ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే .. ఆ తరువాత ప్రాజెక్టును కూడా బన్నీ లైన్లో పెట్టేశాడట. ఈ సినిమాకి మురుగదాస్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా తరువాతనే అల్లు అర్జున్ .. విక్రమ్ కుమార్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడని అంటున్నారు. 'నా పేరు సూర్య' తరువాత త్రివిక్రమ్ ఫ్రీ అయ్యేవరకూ బన్నీ ఆగాడు. ఆయన ఖాళీగా కూర్చున్నాడని అంతా అనుకున్నారు. కానీ సైలెంట్ గా ఆయన తన తదుపరి ప్రాజెక్టులను సెట్ చేసేసుకున్నాడన్నమాట. 

More Telugu News