modi: మాజీ సీఎం కేశుభాయ్ కాళ్లు మొక్కిన మోదీ

  • గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ
  • అన్నపూర్ణ మాత దేవాలయం కార్యక్రమానికి హాజరు
  • కేశుభాయ్ ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని

ప్రధాని మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్ లో ఉన్న అన్నపూర్ణ మాత దేవాలయంలో ఓ కార్యక్రమానికి ఆయన హజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ పాదాలకు ఆయన నమస్కరించారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీని కేశుభాయ్ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

More Telugu News