రాత్రుళ్లు ఫోన్ చేసి నన్ను వేధిస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత సాధినేని యామిని!
- సోషల్ మీడియాలో ఫోన్ నంబర్ పోస్టింగ్
- రోజూ 20-30 కాల్స్ తో వేధింపులు
- గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు
అంతేకాకుండా మార్ఫింగ్ ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి దూషణలకు దిగారు. ఈ నేపథ్యంలో యామిని పీఆర్వో పొట్లూరి వెంకట సుధీర్ గుంటూరులోని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్ కలకాల, మానుకొండ రామిరెడ్డి, వైఎస్సార్ అశోక్, కామిరెడ్డి రాము, మధుసూదనరెడ్డి, లక్ష్మీసుజాత తదితరులు ఈ వేధింపుల వెనుక ఉన్నారని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.