Andhra Pradesh: రాక్షసురాలిగా మారిన తల్లి.. పిల్లలపై ఇటుకతో దాడి.. ఓ కుమారుడి మృతి!

  • తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఘటన
  • ఇద్దరు కన్నకుమారులపై ఇటుకలతో దాడి
  • ఒకరి దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు

కుటుంబ కలహాలో లేక మానసిక సమస్యో తెలియదు కాని ఓ తల్లి మాత్రం రాక్షసురాలిగా మారిపోయింది. కన్నబిడ్డలన్న కనికరం లేకుండా ఇద్దరు చిన్నారులను ఇటుకలతో మోది చంపింది. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ దారుణం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఏమయిందో తెలియదు కాని ఆమె తన ఇద్దరు కుమారులపై ఇటుకతో దాడి చేసింది. ఈ ఘటనలో పెద్దకొడుకు అజయ్(11) తీవ్రంగా గాయపడి చనిపోగా, చిన్న కుమారుడు ఆర్యన్(8) తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.  

 మరోవైపు పిల్లలపై దాడిచేసిన తర్వాత సదరు తల్లి కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనపై పోలీసులు ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

More Telugu News