Kurnool District: ఆగివున్న లారీని ఢీకొన్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు!

  • కర్నూలు జిల్లా ఓర్వకల్ వద్ద ఘటన
  • 14 మందికి గాయాలు
  • నలుగురి పరిస్థితి విషమం

అతివేగంగా వస్తూ, అదుపుతప్పిన కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు, రోడ్డుపై ఆగివున్న లారీని ఢీకొనడంతో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం సోమయాజులపల్లి వద్ద ఈ తెల్లవారుజామున జరిగింది. మొత్తం 14 మంది గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు, గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ బస్సు హైదరాబాద్ కు వస్తోందని పోలీసులు తెలిపారు.

More Telugu News