Andhra Pradesh: విజయవాడలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మెడికల్ అకాడమి విద్యార్థి!

  • కానూర్ వికాస్ మెడికల్ అకాడమీలో ఘటన
  • కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నాడన్న అకాడమి నిర్వాహకులు
  • కార్తీక్ స్వస్థలం కడప జిల్లా రాయచోటి అని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లోని  కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని విజయవాడలో ఉన్న కానూర్ వికాస్ మెడికల్ అకాడమిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ మెడికల్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో చేరిన కార్తీక్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తోటి విద్యార్థులు దీన్ని గమనించి తమకు సమాచారం అందించారన్నారు. ఈ విషయమై కార్తీక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. కుటుంబ సమస్యల కారణంగానే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని వ్యాఖ్యానించారు.

మరోవైపు ఈ ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కార్తీక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. కార్తీక్ స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి అని తెలిపారు. యువకుడి మృతికి కారణమేంటో ఇంకా తమకు తెలియదనీ, దర్యాప్తులో అన్నీ బయటపడతాయని వ్యాఖ్యానించారు. కార్తీక్ తల్లిదండ్రులు స్వస్థలం నుంచి విజయవాడకు బయలుదేరారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News