Telangana: ఎల్బీనగర్ లో నూతన ఫ్లైఓవర్ ప్రారంభం

  • నూతన ఫ్లైఓవర్ ని ప్రారంభించిన మంత్రులు
  • హైదరాబాద్ లోని అన్ని జంక్షన్లను అభివృద్ధి చేస్తాం
  • దశలవారీగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తాం

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో నూతన ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ  హోం శాఖ మంత్రి మహమూద్ ఆలి, మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ ఆలీ మాట్లాడుతూ, హైదరాబాద్ లోని అన్ని జంక్షన్లను అభివృద్ధి చేస్తామని, దశలవారీగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని అన్ని నగరాల కంటే హైదరాబాద్ అభివృద్ధిలో ముందుందని అన్నారు.

More Telugu News