మోదీ విశాఖ సభకు భారీ భద్రత.. షెడ్యూల్ ఇలా..!
- సాయంత్రం 6:20 గంటలకు విశాఖ చేరుకోనున్న ప్రధాని
- 40 నిమిషాల పాటు ప్రసంగించనున్న మోదీ
- గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలతో భారీ భద్రత
సాయంత్రం 6:20 గంటలకు ప్రత్యేక విమానంలో మోదీ నగరంలోని నౌకాదళ వాయుస్థావరమైన ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి 6:45 గంటలకు రైల్వే మైదానానికి చేరుకుని 6:55 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. 7:40 గంటలకు ప్రసంగాన్ని ముగించనున్న మోదీ 7:55 గంటలకు తిరిగి బయలుదేరుతారు.