Andhra Pradesh: రైల్వేజోన్ ప్రకటనతో నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు: కొణతాల రామకృష్ణ

  • ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో బాగా వెనుకబడింది
  • ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పాను
  • అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు

సీఎం చంద్రబాబును ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ ఈ రోజు కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని, అన్ని రంగాల్లోనూ వెనుకబడిన విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఉత్తరాంధ్రను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. పురుషోత్తపట్నం ద్వారా విశాఖకు నీళ్లిస్తున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఏపీకి రైల్వేజోన్ ప్రకటించడంపై ఆయన స్పందించారు. ఈ ప్రకటనతో నవ్వాలో, ఏడ్వాలో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.

More Telugu News