india: భారత్-పాక్ నుంచి మంచి కబురు వింటానని ఆశిస్తున్నా: యూఎస్ అధ్యక్షుడు ట్రంప్

  • భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్తతలకు తెరపడుతుంది
  • ఆశాభావం వ్యక్తం చేస్తున్నా
  • కిమ్ తో భేటీ అనంతరం మీడియాతో డొనాల్డ్ ట్రంప్

భారత్-పాక్ ల నుంచి త్వరలోనే మంచి కబురు వింటానని ఆశిస్తున్నానని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వియత్నాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో భేటీ అయిన అనంతరం, విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్  ల మధ్య ఉద్రిక్తతల అంశం త్వరలో ముగిసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, భారత్, పాక్ విదేశాంగ శాఖా మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో మాట్లాడారు. ఈ క్రమంలోనే ట్రంప్ పైవిధంగా వ్యాఖ్యానించారు.

More Telugu News