Bollywood: డియర్‌ పాక్‌ ట్రోల్స్‌... మీ నీచమైన తత్వానికి నవ్వొస్తోంది : అద్నాన్‌ సమీ

  • మీ మాటలే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి
  • పాకిస్థాన్‌ నెటిజెన్లకు దీటైన సమాధానమిచ్చిన గాయకుడు
  • ఇక్కడ ఇగో సమస్య కాదు...ఉగ్రవాదం సమస్య

తనను ఉద్దేశించి నోటికొచ్చినట్లు పోస్టింగ్స్‌ పెడుతున్న పాకిస్థాన్‌ నెటిజన్లకు ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ లాగి లెంపకాయ కొట్టేలా సమాధామిచ్చాడు. ‘డియర్‌ పాక్‌ ట్రోల్స్‌...మీ నీచమైన తత్వానికి నవ్వొస్తోంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. పాకిస్థాన్‌లో పుట్టిన సమీ కొన్నేళ్ల క్రితం భారత్‌ పౌరసత్వం తీసుకున్నారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ వైమానిక దళం విజయవంతంగా దాడులు నిర్వహించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జై హింద్‌ అని ట్విట్టర్‌లో పేర్కొంటూ పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపాలని, భారత్‌ వైమానిక దళం సామర్థ్యం చూస్తే ముచ్చట వేస్తోందని వ్యాఖ్యానించారు.

దీనిపై పాకిస్థాన్‌ నెటిజన్లు సమీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో పుట్టిన సమీ భారత్‌ పౌరసత్వం తీసుకున్నంత మాత్రాన ఆ దేశానికి మద్దతు ఇవ్వడం ఏమిటంటూ మండిపడ్డారు. దీనికి సమీ తన ట్విట్టర్‌ ద్వారా సమాధానమిస్తూ ఇది ఇగో సమస్య కాదని, మీరు శత్రువులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేయడం గురించి అని  బదులిచ్చారు.

More Telugu News