TRS: టీఆర్ఎస్ పార్లమెంటరీ స్థాయి సమావేశాలను వాయిదా వేసుకుంటున్నాం!: కేటీఆర్

  • భారత్-పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో నిర్ణయం
  • వచ్చే నెల 1 నుంచి 12 వరకూ జరగాల్సిన భేటీ వాయిదా
  • తదుపరి సమావేశాలపై కేసీఆర్ తో చర్చించాక ప్రకటన

ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1 నుంచి 12 వరకూ జరగాల్సిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను వాయిదా వేసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్నారు.

ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మళ్లీ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలన్న విషయమై కేసీఆర్ తో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామన్నారు.

More Telugu News