giribabu: అలా చిరంజీవి వల్ల నష్టపోయాను: సీనియర్ నటుడు గిరిబాబు

  • 'ఇంద్రజిత్' సినిమాను తీశాను 
  • 'కొదమ సింహం'ను విడుదల చేశారు
  • నా సినిమా తక్కువ రేటుకు పోయింది    

హీరోగా .. విలన్ గా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గిరిబాబు ఎన్నో సినిమాల్లో నటించారు. ఏ పాత్రను పోషించినా ఆయన తనదైన ముద్రవేస్తూ వచ్చారు. ఈ తరం హీరోలను గురించి ప్రస్తావిస్తూ .. "ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. చరణ్ .. అల్లు అర్జున్ .. ప్రభాస్ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎవరి స్టైల్ వారిది .. అందరి నటన నాకు నచ్చుతుంది. విజయ్ దేవరకొండ కూడా బాగా చేస్తున్నాడు" అన్నారు.

ఇక గతంలో చిరంజీవితో వచ్చిన విభేదాలను గురించి ప్రస్తావిస్తూ .. " నేను కౌబాయ్ కాన్సెప్ట్ తో 'ఇంద్రజిత్' సినిమా తీశాను. అదే సమయంలో చిరంజీవి 'కొదమ సింహం' సినిమా చేశాడు. నిజానికి మా సినిమా ముందుగా విడుదల కావలసింది. కానీ చిరంజీవి వాళ్లు మా సినిమాను గురించి తెలుసుకుని, తమ సినిమాను ముందుగా విడుదల చేశారు. ఆ సినిమా కాస్తా పరాజయం పాలైంది. దాంతో అదే కాన్సెప్ట్ తో రూపొందిన మా సినిమాను కొనడానికి బయ్యర్లు ధైర్యం చేయలేదు. ఆ కారణంగా తక్కువ రేటుకి అమ్ముకోవలసి వచ్చింది. అలా చిరంజీవి వలన నష్టపోయాను" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News