India: ఢిల్లీలోని పాక్ విదేశాంగ డిప్యూటీ హైకమిషనర్ కు సమన్లు

  • పాక్ ప్రకటన నేపథ్యంలోనే ఈ సమన్లు
  • మా విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి రండి
  • భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన

ఢిల్లీలోని పాక్ విదేశాంగ డిప్యూటీ హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి రావాలని పేర్కొంది. సరిహద్దులోని భారత ఆర్మీ క్యాంపులపై దాడి చేసినట్టు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోనే పాక్ విదేశాంగ డిప్యూటీ హైకమిషనర్ కు ఈ సమన్లు జారీ చేసినట్టు తెలిపింది.

More Telugu News