Mahesh Babu: మహేశ్ బాబు జోక్యం చేసుకోవడంతో వచ్చిన క్లారిటీ

  • హైదరాబాద్ లో 'మహర్షి' షూటింగ్ 
  • మహేశ్ .. అల్లరి నరేశ్ పై చిత్రీకరణ
  •  ఏప్రిల్ 25వ తేదీనే విడుదల

మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో 'మహర్షి' రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మహేశ్ బాబు .. అల్లరి నరేశ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ తరువాత అక్కడే ఒక పాటను షూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏప్రిల్ 25కి కూడా థియేటర్లకు రావడం లేదనీ, జూన్ కి వాయిదా పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై దిల్ రాజు గానీ .. వంశీ పైడిపల్లి గాని స్పందించలేదు. ఈ వార్త మహేశ్ బాబు దృష్టికి వెళ్లడంతో, ఆయన తీవ్రమైన అసహనానికి లోనయ్యాడట. దర్శక నిర్మాతలతో ఈ విషయాన్ని గురించి చర్చించి, వెంటనే క్లారిటీ ఇవ్వమని చెప్పాడట. దాంతో దిల్ రాజు రంగంలోకి దిగిపోయి, ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా ఏప్రిల్ 25కి వస్తుందని స్పష్టం చేశారు. అలా మహేశ్ బాబు జోక్యంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడిపోయింది.

More Telugu News