India: మిరేజ్ ఫైటర్ జెట్స్ పాక్ రాడార్లను ఎలా బురిడీ కొట్టించాయంటే..!

  • బలహీనంగా ఉన్న పాకిస్థాన్ రాడార్లు
  • ఎవరూ ఊహించని దారిలో వెళ్లిన ఫైటర్ జెట్స్
  • యుద్ధ విమానాల్లోని జామర్ల వాడకం

పుల్వామా సమీపంలో ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి జరిగిన తరువాత, భారత్ ఏదో ఒక విధంగా స్పందిస్తుందన్న సంగతి పాకిస్థాన్ కు తెలుసు. అప్రమత్తమై, సరిహద్దుల్లో కాపలాను పెంచింది కూడా. ఇండియా దాడికి దిగితే తిప్పికొట్టాలని సైన్యానికి ఆదేశాలు కూడా జారీ చేసింది.

అయితే, నిన్న తెల్లవారుజామున భారత యుద్ధ విమానాలు సునాయాసంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి లక్షిత దాడులు చేసివచ్చాయి. భారత ఫైటర్ జెట్స్ వస్తున్నాయన్న సంగతిని ఆ దేశ రాడార్లు గమమనించలేదు. పాక్ గగనతలంలోకి మన జెట్స్ ఎలా వెళ్లాయి? వీటిని ఎందుకు రాడార్లు చూడలేదు? వంటి విషయాలను పరిశీలిస్తే...

ఎంత పవర్ ఫుల్ రాడార్ అయినా, కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో పీకల్లోతు మునిగివున్న పాక్, పాతకాలపు రాడార్లనే వాడుతోంది. ఇక వీటితో సరిహద్దు మొత్తంపై నిఘా పెట్టే వీలు లేదు. ఇండియా విమాన స్థావరాలు ఎక్కడుంటాయో, ఆ దిక్కుగా వీటిని మోహరిస్తారు. ఇదే సమయంలో ఎక్కువ ఎత్తులో ఉంటే విమానాలను రాడార్లు సులువుగా గుర్తిస్తాయి.

ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని, పాక్ ఊహించని మార్గాల ద్వారా విమానాలను తక్కువ ఎత్తులో తీసుకెళుతూ, భారత సైన్యం దాడులు జరిపింది. ఇదే సమయంలో ఐఏఎఫ్ విమానాల్లో అత్యాధునిక రాడార్ జామర్ల వ్యవస్థ కూడా ఉండటంతో, వాటి సాయంతో పాకిస్థాన్ రాడార్లు పనిచేయకుండా చేసి, ఆ విషయాన్ని పాక్ అధికారులు గుర్తించేలోగా, పని ముగించుకుని వచ్చేసుంటారని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News