YSRCP: నేడే జగన్ గృహప్రవేశం... భారీగా తరలివస్తున్న కార్యకర్తలు!

  • ఉదయం 9 గంటలకు ముహూర్తం
  • వైసీపీ కార్యాలయం ప్రారంభం కూడా
  • పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, అమరావతిలో నిర్మించుకున్న నూతన గృహంలో నేడు కాలుమోపనున్నారు. ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమంలో జగన్, తన కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశం చేయనున్నారు. ఇంటి ఆవరణలోనే నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు తరలిరావడంతో ఈ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గృహ ప్రవేశం అనంతరం జగన్, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.

More Telugu News