Pakistan: పాకిస్థాన్ ని వాళ్ల గడ్డపైనే కొట్టామంటూ మోదీపై బీజేపీ నేత ప్రశంసలు

  • ఉగ్రవాదాన్ని సహించమని మోదీ ఎప్పుడూ చెబుతారు
  • ఏం చెబుతారో, అదే చేసి చూపిస్తారు
  • మోదీ తన 56 అంగుళాల ఛాతీని ఉగ్రమూకలకు చూపించారు

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓంకే)లో భారత వాయుసేన దాడులపై యావత్తు దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. పాక్ కు తగిన విధంగా బుద్ధి చెప్పారంటూ అధికార పక్ష నేతలే కాకుండా విపక్ష నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్రధాని మోదీపై బీజేపీ ఎంపీల ప్రశంసల వర్షం కొనసాగుతోంది.

తాజాగా, హర్యానా బీజేపీ ఎమ్మెల్యే అంజి విజ్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. మోదీ ఏం చెబుతారో, అదే చేసి చూపిస్తారని అన్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని మోదీ ఎప్పుడూ చెబుతుంటారని, ఆ విధంగానే ఆయన చేశారని ప్రశంసించారు. పాకిస్థాన్ ని వారి గడ్డపైనే కొట్టామని, తగిన బుద్ధి చెప్పామని, మోదీ తన 56 అంగుళాల ఛాతీని పాక్ ఉగ్రమూకలకు చూపించారని, ‘ఇది సింహం ఛాతి’ అని ప్రశంసలు కుపించారు.

More Telugu News