delhi: భగవంతుడి కృప ఎప్పుడూ మనపైనే ఉంటుంది: ప్రధాని మోదీ

  • ఉగ్రవాదులు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు
  • ఉగ్రవాదం ఎప్పటికైనా ఓడిపోతుందని తెలియజేయాలి
  • అతిపెద్ద భగవద్గీతను ప్రారంభించిన మోదీ

ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను ప్రధాని మోదీ ప్రారంభించారు. దక్షిణ ఢిల్లీలోని కైలాశ్ కాలనీకి సమీపంలో ఉన్న ఇస్కాన్ దేవాలయాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అతిపెద్ద భగవద్గీతను ఆయన విడుదల చేశారు. ఈ అతిపెద్ద భగవద్గీత 670 పేజీలతో 800 కిలోల బరువు ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారని, తీవ్ర వాదుల ఆగడాల నుంచి మనమంతా భూమిని కాపాడాలని కోరారు. భగవంతుడి కృప ఎప్పుడూ మనపైనే ఉంటుందన్న మోదీ, ఉగ్రవాదం ఎప్పటికైనా ఓడిపోతుందని వారికి తెలియజేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News