venumadhav: అతి పొగడ్తలతో ఆశ్చర్యపరిచిన వేణుమాధవ్

  • ఈ రోజు శివాజీరాజా పుట్టినరోజు
  • చేపల పులుసు గురించి ప్రస్తావించిన వేణుమాధవ్
  • అభిమానం హద్దులు దాటిందంటూ విమర్శలు     

నటుడు ... 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా పుట్టినరోజు .. ఈ రోజు. ఈ పుట్టినరోజు వేడుకలో కమెడియన్ వేణుమాధవ్ మాట్లాడుతూ, శివాజీరాజా అంతటి చెడ్డవాడు లేడు .. ఆయనంత దుర్మార్గుడు లేడు అంటూనే తనదైన శైలిలో శివాజీరాజా మంచితనాన్ని గురించి చెప్పుకొచ్చాడు.

"శివాజీ అన్నా, చేపల పులుసు తిందువుగానీ రా'' అని నేను అంటే, "వద్దురా .. ఆ చేపల పులుసుకు ఎంత ఖర్చు అవుతుంది .. ఓ 500 అవుతుందా? అందులో ఒక 300 ఏ ఆర్టిస్టుకైనా ఇవ్వు .. వాళ్లకి ఒకపూట గడిచిపోతుంది" అనేవాడు అంటూ వేణుమాధవ్ చేపల పులుసు సంగతి చెప్పుకొచ్చాడు.  

More Telugu News