ajith: అత్యధిక థియేటర్లలో అజిత్ 'విశ్వాసం' విడుదల

  • తమిళంలో భారీ విజయం
  • 200 కోట్లకి పైగా గ్రాస్  
  • తెలుగులో మార్చి 1న రిలీజ్

తమిళంలో అజిత్ కథానాయకుడిగా నటించిన 'విశ్వాసం' సంక్రాంతి' రోజుల్లో అక్కడ సందడి చేసింది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించాడు. అజిత్ - శివ కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలన్నీ భారీ విజయాలను అందుకున్నాయి. దాంతో 'విశ్వాసం' కూడా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, వాళ్ల అంచనాలను అందుకుంది.

అక్కడ ఈ సినిమా 200 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. అదే సమయంలో ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇక్కడ గట్టిపోటీ ఉండటం వలన కుదరలేదు. తెలుగులో 'విశ్వాసం' సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మాస్ ఆడియన్స్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ సినిమా, ఇక్కడ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

More Telugu News