sensex: బుల్ జోరు... దూసుకుపోయిన సెన్సెక్స్

  • 342 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 88 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3 శాతం పైగా లాభపడ్డ యస్ బ్యాంక్, టీసీఎస్

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉన్న సానుకూలతల కారణంగా ఐటీ, ఫైనాన్స్ రంగాలు బుల్ జోరును ముందుండి నడిపించాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తొలి గంటలో నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్లు... ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 342 పాయింట్లు పెరిగి 36,213కు చేరుకుంది. నిఫ్టీ 88 పాయింట్లు లాభపడి 10,880కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (3.24), టీసీఎస్ (3.07), ఇన్ఫోసిస్ (2.94), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.95), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.52).

టాప్ లూజర్స్:
కోల్ ఇండియా (0.37), ఏషియన్ పెయింట్స్ (0.23), ఎల్ అండ్ టీ (0.20), ఓఎన్జీసీ (0.20), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.20)       

More Telugu News