aimia: ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్

  • ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటన
  • ప్రస్తుతం డబీర్ పుర కార్పొరేటర్ గా ఉన్న రియాజ్ 
  • ఐదు స్థానాలకు జరగనున్న ఎన్నికలు

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం ఐదు స్థానాలకు గాను నలుగురు అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఒక స్థానాన్ని తన మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది. ఈ క్రమంలో తమ పార్టీ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ పేరును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. రియాజ్ పేరును ప్రకటించడం సంతోషకరంగా ఉందంటూ ఓ ట్వీట్ చేశారు. కాగా, ప్రస్తుతం డబీర్ పుర కార్పొరేటర్ గా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ ఉన్నారు.


More Telugu News