Andhra Pradesh: రేపు కర్నూలులో పవన్ కల్యాణ్ రోడ్ షో.. వివరాలు ప్రకటించిన జనసేన పార్టీ!

  • మధ్యాహ్నం 2 గంటలకు రోడ్ షో ప్రారంభం
  • సీ క్యాంప్ నుంచి కొండారెడ్డి బురుజు వరకూ కార్యక్రమం
  • భారీగా హాజరుకానున్న జనసేన కార్యకర్తలు, అభిమానులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడు పెంచారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో రేపు ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ పేర్కొంది. కర్నూలు పట్టణంలోని సీ-క్యాంప్ నుంచి కొండారెడ్డి బురుజు వరకూ రోడ్ షో సాగుతుందని వెల్లడించింది. ఈ రోడ్ షో రేపు మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుందని పేర్కొంది. ఈ మేరకు జనసేన పార్టీ పవన్ కల్యాణ్ రోడ్ షో వివరాలను ట్విట్టర్ లో ప్రకటించింది. కాగా, ఈ కార్యక్రమానికి అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

More Telugu News