Tamilnadu: చెన్నైలోని సవిత ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో అగ్నిప్రమాదం.. హాస్టల్ లో భారీగా తెలుగు విద్యార్థులు.. తప్పిన ముప్పు!

  • ఈరోజు ఉదయం 5 గంటలకు మంటలు
  • విద్యార్థుల అప్రమత్తతతో తప్పిన ముప్పు
  • మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది

తమిళనాడు రాజధాని చెన్నైలోని సవిత ఇంజనీరింగ్ కాలేజీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కళాశాల అబ్బాయిల హాస్టల్ నాలుగో అంతస్తులో ఈరోజు ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే కాలేజీలోని మిగతా అంతస్తులకు సైతం ఈ మంటలు వ్యాపించాయి. కాగా, ఈ కళాశాలలో తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులు గణనీయమైన సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

మంటలను ముందుగానే గమనించిన విద్యార్థులు అప్రమత్తమై బయటకు వచ్చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. కాగా, ఈ ప్రమాదం జరగడానికి గల కారణమేంటో ఇంకా తెలియరాలేదు. మొత్తం ఈ హాస్టల్ లో 8 అంతస్తులు ఉండగా, నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి.

More Telugu News