Imran khan: భారత్ దుస్సాహసానికి దిగితే దీటుగా తిప్పికొట్టండి: సైన్యానికి ఇమ్రాన్ ఆదేశం

  • ఇమ్రాన్ అధ్యక్షతన సమావేశమైన ఎన్ఎస్‌సీ
  • పుల్వామా దాడిని ఓ సంఘటనగా అభివర్ణించిన వైనం
  • ఆ దాడితో తమకు సంబంధం లేదన్న ఎన్ఎస్‌సీ

పుల్వామా దాడితో భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సైన్యాధికారులతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇమ్రాన్ అధ్యక్షతన పాకిస్థాన్ భద్రతా మండలి (ఎన్ఎస్‌సీ) గురువారం సమావేశమైంది. పాక్‌లోని త్రివిధ దళాధిపతులు, భద్రత-నిఘా వర్గాల చీఫ్‌లు, కేంద్ర ఆర్థిక, రక్షణ, విదేశాంగ, అంతర్గత భద్రత వ్యవహార శాఖల మంత్రులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. భారత్ నుంచి ఎదురయ్యే ఎటువంటి దాడినైనా సమర్థంగా ఎదుర్కోవాలని, దీటుగా.. సమగ్రంగా బదులివ్వాలని ఆదేశించారు. పుల్వామా ఘటనను ఓ సంఘటనగా మాత్రమే పేర్కొన్న ఎన్ఎస్‌‌సీ.. ఆ దాడితో తమకు ఎంతమాత్రమూ సంబంధం లేదని మరోమారు తేల్చి చెప్పింది.

More Telugu News