NTR: ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ రేపు పర్వదినం: నందమూరి బాలకృష్ణ

  • రేపు ‘మహానాయకుడు’ విడుదల 
  • తెలుగు జాతి కోసం తీసిన బయోపిక్ ఇది 
  • ప్రతి విషయంలో తన తండ్రి ఎన్టీఆర్ ఇన్ స్పిరేషనే

తెలుగు ప్రజలకు ప్రతి విషయంలో తన తండ్రి ఎన్టీఆర్ ఇన్ స్పిరేషనే అని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ, నాడు టీడీపీ పార్టీ స్థాపించడం, ఆ తర్వాత తొమ్మిది నెలలకే ఎన్టీఆర్ అధికారంలోకి రావడం, ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం.. ఇవన్నీ రికార్డులేనని అన్నారు.

ఈ బయోపిక్ కేవలం ఎన్టీఆర్ అభిమానులకే కాదని, తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతి కోసం తీసిందని, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ రేపు పర్వదినం అని అన్నారు. ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు, నేను అందులో ఓ అర్చకుడిని’ అనే నానుడి తన తండి నుంచి వచ్చిందేనని గుర్తుచేశారు.

More Telugu News