priyamani: ప్రియమణి ప్రధాన పాత్రలో .. థ్రిల్లర్ మూవీగా 'సిరివెన్నెల'

  • కథానాయికగా మంచి పేరు 
  • థ్రిల్లర్ జోనర్లో సాగే మూవీ
  •  విలన్ గా 'కాలకేయ' ప్రభాకర్    

తెలుగులో నిన్నటితరం కథానాయికల జాబితాలో ప్రియమణి ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది. కెరియర్ ఆరంభంలో కథానాయికగా ఆడిపాడిన ఆమె, ఆ తరువాత 'క్షేత్రం' .. 'చారులత' సినిమాలలో ప్రధాన పాత్రధారిగా అదరగొట్టేసింది. కొత్త కథానాయికల పోటీ కారణంగా ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలా తెలుగు ప్రేక్షకులకు కొంతకాలంగా దూరమైన ప్రియమణి, తాజాగా మరో సినిమాలో ప్రధాన పాత్రధారిగా చేసింది .. ఆ సినిమా పేరే 'సిరివెన్నెల'.

రామసీత - బాషా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇటీవలే టాకీపార్టును పూర్తి చేసుకుంది .. రెండు పాటలు మాత్రమే చిత్రీకరించవలసి వుంది. పులిజాల ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, థ్రిల్లర్ జోనర్లో సాగేదే అయినప్పటికీ, కుటుంబ సమేతంగా చూడదగినదిగా ఉంటుందని అంటున్నారు. 'కాలకేయ' ప్రభాకర్ ప్రధానమైన విలన్ గా నటించిన ఈ సినిమాలో, రాజేంద్ర ప్రసాద్ మనవరాలు (మహానటి .. చైల్డ్ ఆర్టిస్ట్) కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News