హరీశ్ శంకర్ 'వాల్మీకి' షూటింగ్ మొదలైపోయింది
- హరీశ్ శంకర్ నుంచి 'వాల్మీకి'
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
- ఈ ఏడాది చివరిలో విడుదల
ఈ రీమేక్ కి 'వాల్మీకి' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్న ఆయన ఒక హీరోగా వరుణ్ తేజ్ ను ఎంపిక చేసుకున్నాడు. మరో హీరోగా అథర్వ మురళిని తీసుకునే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఈ రోజునే మొదలైంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఇది తన కెరియర్లో ఓ డిఫరెంట్ మూవీ అవుతుందనే నమ్మకంతో వరుణ్ తేజ్ వున్నాడు.