ఎడాపెడా అప్పులు చేసిన మహిళ.. స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్తులు, భర్త!
- ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఘటన
- పలువురి వద్ద రూ.2.5 లక్షల అప్పు చేసిన యల్లమ్మ
- 10 రోజుల తర్వాత కనిపించడంతో గ్రామస్తుల ఆగ్రహం
దాదాపు 10 రోజుల తర్వాత యల్లమ్మ కాలనీలో కనిపించడంతో గ్రామస్తులు, భర్త ఆమెను ఓ స్తంభానికి కట్టేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెపై చేయిచేసుకున్నారు. విషయం తెలుసుకుని మీడియా అక్కడకు వెళ్లడంతో యల్లమ్మను తాము కొట్టలేదని గ్రామస్తులు బుకాయించారు. కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించి సమస్యను పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.
కాగా, ఈ విషయమై యల్లమ్మ మాట్లాడుతూ.. ఓ వ్యక్తికి అవసరమని కోరితే తాను అప్పు చేసి మరీ డబ్బులు ఇచ్చాననీ, అయితే సదరు వ్యక్తి తన నుంచి డబ్బు తీసుకోలేదని ఇప్పుడు బుకాయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరినా పోలీసులు స్పందించలేదని వాపోయింది.