Rahul Gandhi: తమిళనాడులో డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్న కాంగ్రెస్

  • స్టాలిన్‌తో ముకుల్ వాస్నిక్ భేటీ
  • రాహుల్‌తో కనిమొళి భేటీ
  • పొత్తు ప్రకటన చేసిన స్టాలిన్‌, ముకుల్
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే.. నేడు కాంగ్రెస్, డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో తమిళనాడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ భేటీ అయ్యారు.

ఈ చర్చల అనంతరం స్టాలిన్, ముకుల్ వాస్నిక్ పొత్తు ప్రకటన చేశారు. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలకు గాను 9 స్థానాలలోనూ, పుదుచ్చేరిలో 1 స్థానంలోను కాంగ్రెస్ పోటీ చేయనుంది. 20కి పైగా స్థానాల్లో డీఎంకే పోటీ చేయనుంది. మిగిలిన సీట్లను కూటమి భాగస్వామ్య పక్షాలైన ఎండీఎంకే, సీపీఎం, వీసీకే, ఎంఎంకేలకు కేటాయించనున్నారు.
Rahul Gandhi
Stalin
Mukul Vasnik
Kanimozi
Puducheri
DMK

More Telugu News