kondaveedu: కొండవీడులో పర్యటించనున్న టీడీపీ, వైసీపీ, జనసేన నేతలు.. హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

  • కొండవీడులో ఆత్మహత్యకు పాల్పడిన రైతు
  • రైతులతో భేటీ కానున్న మంత్రి పుల్లారావు
  • గ్రామంలో పర్యటించనున్న వైసీపీ, జనసేన నిజనిర్ధారణ కమిటీలు

గుంటూరు జిల్లా కొండవీడులో కోటేశ్వరరావు అనే రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన పూర్తిగా రాజకీయ రంగును పులుముకుంది. ఈరోజు కోటేశ్వరరావు పొలంలోనే స్థానిక రైతులతో మంత్రి పుల్లారావు భేటీ కానున్నారు. మరోవైపు, గ్రామంలో వైసీపీ, జనసేన నిజనిర్ధారణ కమిటీలు పర్యటించనున్నాయి. ఈ నేపథ్యంలో, అక్కడ ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. కీలక పార్టీల నేతలు రానుండటంతో... కొండవీడులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

  • Loading...

More Telugu News