railakshmi: ఇప్పటికీ నన్ను 'రత్తాలు' అనే పిలుస్తున్నారు: హీరోయిన్ రాయ్ లక్ష్మి

  • తెలుగులో హీరోయిన్ గా సక్సెస్ రాలేదు
  • స్పెషల్ సాంగ్స్ చేయడమంటే నాకు ఇష్టమే
  • 'రత్తాలు' సాంగ్ మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది       

రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రధారిగా 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' సినిమా నిర్మితమైంది. మార్చి1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో రాయ్ లక్ష్మి బిజీగా వుంది. తాజా ఇంటర్వ్యూలో రాయ్ లక్ష్మి మాట్లాడుతూ, తెలుగులో తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించింది.

"తెలుగులో నేను చేసిన తొలి రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడం వలన, ఇక్కడ నాకు అవకాశాలు తగ్గాయి. ఐటమ్ సాంగ్స్ చేయడమంటే నాకు ఇష్టమే .. అందువల్లనే చిరంజీవి .. పవన్ కల్యాణ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్ అనగానే చేసేశాను. చిరంజీవిగారి 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో 'రత్తాలు రత్తాలు'అనే ఐటమ్ సాంగ్ కోసం ముందురోజు రాత్రే సంప్రదించారు. మరునాడు ఉదయం షూటింగ్ పెట్టేశారు. ప్రాక్టీస్ చేసే సమయం లేకపోయినా, ఈ ఐటమ్ సాంగ్ నాకు ఎంతో క్రేజ్ ను తీసుకొచ్చింది. ఇప్పటికీ నేను ఎక్కడ కనిపించినా 'రత్తాలు' అనే పిలుస్తున్నారు" అంటూ చెప్పుకొచ్చింది.

More Telugu News