amit shah: నేడు చెన్నై వెళ్లనున్న అమిత్ షా.. కీలక ప్రకటన వెలువడే అవకాశం

  • అమిత్ షా తో భేటీ కానున్న అన్నాడీఎంకే సీనియర్లు
  • పొత్తు, సీట్ల పంపకాలపై చర్చ
  • సమావేశానంతరం కీలక ప్రకటన చేయనున్న బీజేపీ అధినేత

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు చెన్నై వెళ్లనున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తుపెట్టుకోబోతోంది. చెన్నై పర్యటన సందర్భంగా అన్నాడీఎంకే సీనియర్ నేతలు అమిత్ షాతో భేటీకానున్నారు. ఈ సమావేశంలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఖరారుకానున్నాయి. భేటీ ముగిసిన తర్వాత పొత్తు, సీట్ల పంపకాలపై అమిత్ షా కీలక ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు తమిళనాడు బీజేపీ నేతలు ప్రకటించారు. మరోవైపు, ఒకట్రెండు రోజుల్లో పొత్తులపై ప్రకటన చేస్తామని తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం నిన్న రాత్రి మీడియాకు తెలిపారు.

More Telugu News