maoist: మహిళా మావోయిస్టుకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన జవాను

  • జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భమ్ లో ఘటన
  • బలగాలు, మావోల మధ్య ఎదురుకాల్పులు
  • బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డ మహిళా మావోయిస్టు
సీఆర్పీఎఫ్ జవాన్లు మానవత్వాన్ని ప్రదర్శించారు. ఓ ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడ్డ మహిళా మావోయిస్టుకు రక్తదానం చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భమ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ సింగ్ భమ్ ప్రాంతంలో 24 మంది మావోయిస్టులు సమావేశమైనట్టు 14వ తేదీన సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్, ప్రత్యేక పోలీసుల బృందాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి.

ఈ సందర్భంగా మావోయిస్టులను చుట్టుముట్టిన బలగాలు వారిని లొంగిపోవాలని కోరాయి. కానీ, మావోలు మందుపాతరను పేల్చి, కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు యత్నించారు. దీంతో, బలగాలు కూడా ఎదురుకాల్పులను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో, కాల్పులు జరిగిన స్థలంలో బుల్లెట్ తగిలి, తీవ్రంగా గాయపడ్డ మహిళా మావోయిస్టును బలగాలు గుర్తించాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు రక్త దానం చేశారు.
maoist
woman
crpf
blood donation
jarkhand

More Telugu News