కశ్మీర్ వేర్పాటువాదులకు షాక్.. పోలీస్ భద్రతను ఉపసంహరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం!
- పుల్వామా దాడి నేపథ్యంలో ఘటన
- జాబితాలో మిర్వాజ్ ఫరూక్, షాబిర్ షా
- సాయంత్రంలోగా భద్రత ఉపసంహరణ
అంతేకాకుండా వీరి రక్షణకు ఇచ్చిన ప్రభుత్వ వాహనాలు, ఇతర సౌకర్యాలను ఉపసంహరించుకున్నారు. పుల్వామాలోని అవంతిపొరాలో గత గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జైషే కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ 100-150 కేజీల హైగ్రేడ్ ఆర్డీఎక్స్ ను వాడినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.