‘జనసేన’ స్క్రీనింగ్ కమిటీకి తన బయోడేటా సమర్పించిన నాదెండ్ల మనోహర్
- ‘జనసేన’ కార్యాలయంలో ఆశావహుల సందడి
- అభ్యర్థిత్వం ఆశిస్తున్న విద్యావంతులు, మహిళలు
- తుది గడువు ప్రకటించే వరకూ బయో డేటాల స్వీకరణ
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పార్టీ నియమావళిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎంత క్రమశిక్షణతో అనుసరిస్తారో, అదే విధంగా తమ నాయకులు, జనసైనికులు కూడా అనుసరిస్తారని అన్నారు. తొలి బయో డేటాను స్క్రీనింగ్ కమిటీకి సమర్పించిన పవన్ కల్యాణ్ ఈ నియమావళిని అనుసరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, రేపు ఆదివారం అయినప్పటికీ ఆశావహుల బయో డేటాలు తీసుకుంటామని, తుది గడువు ప్రకటించే వరకూ బయో డేటాల స్వీకరణ కొనసాగుతుందని స్క్రీనింగ్ కమిటీ పేర్కొంది.