Chandrababu: దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: చంద్రబాబు

  • రక్షణ శాఖలో కుంభకోణాలను ఖండిస్తున్నాం
  • రాఫెల్ డీల్ పై రాజీలేని పోరాటం చేస్తాం
  • ఏపీ అభివృద్ధిని మోదీ, కేసీఆర్ లు జీర్ణించుకోలేకపోతున్నారు

దేశ భద్రత విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజీపడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రక్షణశాఖలో చోటు చేసుకుంటున్న కుంభకోణాలను ఖండిస్తున్నామని చెప్పారు. రాఫెల్ డీల్ పై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. కుట్రలు కుతంత్రాలకు తాము దూరంగా ఉంటామని చెప్పారు. మోదీ ముఖ్యమంత్రి కాకముందే గుజరాత్ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఏపీ అభివృద్ధి చెందుతుండటాన్ని ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఏపీపై మోదీ చూపుతున్న వివక్షకు విజయవాడ కనదుర్గ ఫ్లైవోవర్ ఒక నిదర్శనమని చెప్పారు.  

More Telugu News