nandita raj: వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన థ్రిల్లర్ మూవీగా 'విశ్వామిత్ర'

  • రాజకిరణ్ నుంచి మరో హారర్ థ్రిల్లర్ 
  • ప్రధాన పాత్రధారిగా నందితా రాజ్
  •  వచ్చేనెల 21న సినిమా విడుదల  

'గీతాంజలి'.. 'త్రిపుర' వంటి హారర్ థ్రిల్లర్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన రాజకిరణ్, దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా ఆయన మరో హారర్ చిత్రాన్ని రూపొందించాడు .. అయితే ఈ సారి ఆయన కథను వాస్తవ సంఘటనల నుంచి గ్రహించాడు. అమెరికా .. న్యూజిలాండ్ లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను సిద్ధం చేసుకున్నట్టుగా రాజ కిరణ్ చెప్పాడు.

'విశ్వామిత్ర' పేరుతో నిర్మితమైన ఈ సినిమా నుంచి ఈ నెల 21వ తేదీన ట్రైలర్ ను వదలనున్నారు. వచ్చేనెల 21వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నందితా రాజ్ ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ప్రసన్న .. అశుతోష్ రాణా .. 'సత్యం' రాజేశ్ .. విద్యుల్లేఖ రామన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

More Telugu News