pakistan high commissioner: పాకిస్థాన్ హైకమిషనర్ కు సమన్లు జారీ చేసిన ఇండియా

  • సొహైల్ మహ్మూద్ ను పిలిపించుకున్న విజయ్ గోఖలే
  • పుల్వామా ఘటనపై నిరసన వ్యక్తం చేసిన విదేశాంగ కార్యదర్శి
  • జైషే మొహమ్మద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జైషే మొహమ్మద్ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ హైకమిషనర్ సొహైల్ మహ్మూద్ కు భారత్ సమన్లు జారీ చేసింది. మహ్మూద్ ను భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించుకున్నారు. పుల్వామాలో జరిగిన ఘటనపై ఈ సందర్భంగా తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. జైషే మొహమ్మద్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాక్ గడ్డపై నుంచి పని చేస్తున్న టెర్రరిస్టు సంస్థలను, వాటికి సహకరిస్తున్న వ్యక్తులను అణచివేయాలని సూచించారు.


More Telugu News