రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 20-30 మంది టీడీపీ నేతలకు టికెట్లు దక్కవు!: బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు
- వాళ్లే ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు
- పదవుల కోసమే అవంతి, ఆమంచి వైసీపీ తీర్థం
- కులం ప్రస్తావన తీసుకురావడంపై మండిపాటు
తొలుత ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్, ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం అయ్యారనీ, చివరికి టీడీపీలో చేరి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆఖరి నిమిషంలో వైసీపీలో చేరారని దుయ్యబట్టారు. ఇప్పుడు వైసీపీలోకి వెళుతూ కులం పేరు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీలో 20-30 మందికి టికెట్లు దక్కవనీ, వారే ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారని స్పష్టం చేశారు.