rana: రానా .. త్రిషల ప్రేమ వ్యవహారం గురించి మళ్లీ మాట్లాడుకునేలా చేసిన ఆర్య

  • గతంలో రానా .. త్రిషల ప్రేమ వ్యవహారంపై వార్తలు
  • ఆ తరువాత ఏర్పడిన గ్యాప్ 
  • మళ్లీ చేరువయ్యారనే ప్రచారం    

హీరో ఆర్య .. హీరోయిన్ సాయేశా సైగల్ ప్రేమలో పడ్డారనే వార్తలు కొంతకాలంగా షికారు చేస్తున్నాయి. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా ఊపందుకుంది. ఈ వార్తలో నిజం ఉందనేది రీసెంట్ గా స్పష్టమైపోయింది. దాంతో అటు ఆర్యకి .. ఇటు సాయేషా సైగల్ కి సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాబోయే దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ రానా .. త్రిష ట్వీట్ చేశారు.

ఇద్దరి ట్వీట్ కి ఆర్య థ్యాంక్స్ చెబుతూ .. " మీ పెళ్లి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను" అని రీ ట్వీట్ చేశాడు. దాంతో రానా .. త్రిషల మధ్య ప్రేమ వ్యవహారం మళ్లీ పట్టాలెక్కిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆ మధ్య ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారనే వార్తలు వచ్చాయి. తాము డేటింగ్ కూడా చేసినట్టు ఒక ఇంటర్వ్యూలో రానా చెప్పాడు. ఎందుకనో తెలియదు గానీ ఆ తరువాత ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు ఇద్దరూ చేరువయ్యారనే టాక్ మాత్రం బలంగానే వినిపిస్తోంది. వీళ్ల ప్రేమ కూడా పెళ్లివరకూ వెళుతుందేమో చూడాలి.

More Telugu News